శ్రీదేవి కూతురు జాన్వికపూర్ గర్భం తీయించుకుందా..? ముంబైలో ఆపరేషన్!

కూతురు జాన్వీకపూర్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. గత కొంతకాలంగా బాయ్ ఫ్రెండ్ తో ఈ బ్యూటీ డేటింగ్ చేస్తుండగా.. గర్భం దాల్చిందనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ముంబైలో జాన్వీకపూర్ ఆపరేషన్ చేయించుకుని గర్బం తొలగించుకుందని ప్రచారం నడుస్తోంది. ఈ వార్తలపై జాన్వీకపూర్ తండ్రి బోనీ కపూర్ సీరియస్ అయ్యాడు. పెళ్లికి ముందు జాన్వీకపూర్ గర్భవతి అయిందనే వార్తలను ఆయన ఖండించాడు.

తాజాగా యూట్యూబర్ రోహన్ దువాకు బోనీకపూర్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా జాన్వీకపూర్ పై వచ్చిన పుకార్లపై రియాక్ట్ అయ్యాడు. ఈ సందర్బంగా శ్రీదేవితో వివాహం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. శ్రీదేవితో తన వివాహం షిర్డీలో జరిగిందని, జూన్ 2,1996లో వివాహం చేసుకున్నామని అన్నారు. జనవరిలో శ్రీదేవి గర్బవతిగా కనిపించిందని, దీంతో బహిరంగంగా పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదని అన్నాడు. దీంతో 1997లో పబ్లిక్ గా వివాహం చేసుకున్నామని వెల్లడించారు. తమకు జాన్వీకపూర్ పెళ్లికి ముందే పుట్టిందని కొంతమంది రాస్తున్నారని బోనీకపూర్ అన్నాడు.

బోనీకపూర్, శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ ఉన్నారు. ఇక బోనీకపూర్ మొదటి భార్య మోనా శౌరికి అర్జున్ కపూర్, అన్షులా కపూర్ ఉన్నారు. అయితే దుబాయ్ లోని ఓ హోటల్ లో 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడి ప్రాణాలు కోల్పోయింది. కాగా జాన్వీకపూర్ ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, టీచర్లు ట్రెండింగ్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.