Bigboss7: ఈవారం నామినేషన్ లో ఉన్నది వీళ్లే.. రాజకీయం మొదలైందా..?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి 14 మంది కంటెస్టెంట్లతో షోని ప్రారంభించి ఆ తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఐదు మందిని హౌస్ లోకి తీసుకొచ్చారు. ఇకపోతే నిన్నటికి నిన్న ఎలిమినేట్ అయిన రతిక రోజ్ కూడా మళ్లీ రీ యంట్రీ ఇవ్వడం జరిగింది. ఇకపోతే సోమవారం ఎపిసోడ్లో భాగంగా నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్ లో శివాజీ.. శోభా శెట్టి ప్రియాంకాలను నామినేట్ చేయగా.. అశ్విని కూడా శోభా శెట్టి ప్రియాంకాలను నామినేట్ చేసింది.

ఇక తర్వాత గౌతమ్.. ప్రశాంత్, భోలే లను నామినేట్ చేయగా, ప్రియాంక.. భోలే, అశ్వినీలను నామినేట్ చేసింది. సందీప్ మాస్టర్ .. అశ్విని, భోలేలను నామినేట్ చేశారు. శోభా శెట్టి.. శివాజీ, యావర్లను, భోలే.. శోభా శెట్టి, గౌతమ్లను నామినేట్ చేశారు. ఇలా నిన్నటి మంగళవారం ఎపిసోడ్లో మిగిలిన నామినేషన్ కూడా పూర్తి అయ్యాయి. అయితే ఈ నామినేషన్స్ లో ప్రశాంత్ .. గౌతమ్ ని సరైన కారణం లేకుండా నామినేట్ చేయడంతో గౌతమ్ ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు. ప్రశాంత్ ని ఇమిటేట్ చేస్తూ గౌతమ్ రెచ్చిపోయాడు.

ఇక ప్రశాంత్ ఏమి చేయలేక సైలెంట్ గా ఉండిపోయాడు. అలాగే ప్రశాంత్ అమర్దీప్ ని కూడా నామినేట్ చేసి మా గ్రూప్ బోలె గురించి మాట్లాడటం నచ్చలేదని చెప్పడంతో ఇక్కడ గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయని అమర్ కూడా ఫైర్ అవడం జరిగింది. ఇక మొత్తంగా ఈ వారం నామినేషన్ లో భాగంగా శోభా శెట్టి, భోలే, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్ దీప్ , సందీప్, గౌతమ్ లు ఉన్నారు. మరి ఈ వారం వీకెండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.