సినీ ఇండస్ట్రీలో విషాదం బలగం నటుడు మృతి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిత్రం బలగం.. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా లో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్రామ్ జంటగా నటించారు.. అలాగే రచ్చ రవి, రూప ,మురళీధర్ గౌడ్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని నిర్మాతగా దిల్ రాజు నిర్మించడం జరిగింది.అయితే ఈ సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించిన నర్సింగం తాజాగా మరణించినట్లు తెలుస్తోంది.

Image

ఈ విషయాన్ని డైరెక్టర్ వేణు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ట్విట్టర్లో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ విషయాన్ని ట్వీట్ చేసిన వేణు ఈ విషయం తెలుసుకున్న పలువురు చిత్ర బృంద సభ్యులకు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వేణు ట్విట్టర్లో ఇలా రాసుకోస్తూ..”నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి.. మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుడిని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తాను అని తెలిపారు”.

బలగం కథ కోసం రీచార్జ్ చేస్తున్న సమయంలో మొదటిగా నరసింహ బాపూనే కలిశాను.. ఆరోజు కళ్ళు గూడాలు తెప్పించాడు నాకోసం అంటూ బలగం సినిమా రోజులను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు డైరెక్టర్ వేణు.. అయితే ఈ విషయం తెలిసి పలువురు సినీ సెలబ్రిటీలు నేటిజెన్లు సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేస్తున్నారు బలగం సినిమాకి అవార్డులు కూడా రావడం జరిగింది.