థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆ కల్ట్‌ క్లాసిక్ మూవీ.. ఏడిపించడం ఖాయమే..!

7జి బృందావన్ కాలనీ హీరో రవికృష్ణ అందరికి గుర్తుండే ఉంటాడు. ఈ సినిమా తర్వాత రవికృష్ణ నటించినవేవి ఆడకపోవడంతో చాలా త్వరగా ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియనంత దూరంగా చెన్నైలో ఉండిపోయాడు. తండ్రి నిర్మాత ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ ని హీరోగా తీసుకొంక్ తో ‘హరిహర వీరమల్లు’ తీస్తున్నా సరే కనీసం దాని సెట్లలో కూడా రవికృష్ణ కనిపించేవాడు కాదు. అయితే దాదాపు 19 ఏళ్ళ తరువాత రవికృష్ణ మీడియా ముందుకు వచ్చాడు. ఎందుకంటే తనకు పేరు తెచ్చిన డెబ్యూ మూవీ 7 జి బృందావన్ కాలనీ సినిమా కోసం అతను ఇన్నెళ్ల తరువాత మీడియా ముందుకు వచ్చాడు.

సెప్టెంబర్ 22న 7జి బృందావన్ కాలనీ సినిమా రీ రిలీజ్ కాబోతున్న కారణం గా ఆ మూవీ టీమ్ ఏదో కొత్త సినిమా విడుదల అవుతుంది అనే రేంజ్ లో ప్రమోషన్లు చేస్తున్నారు . హీరోయిన్ సోనియా అగర్వాల్ తో సహా మూవీ టీమ్ అంత ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నారు. శుక్రవారం అందరూ కలిసి సుదర్శన్ థియేటర్ లో షో కూడా చూడబోతున్నారు. విచిత్రమేంటంటే తనకు మంచి గుర్తింపు తెచ్చిన 7 జి బృందావన్ కాలనీ సినిమాని రవికృష్ణ ఇప్పటివరకూ పూర్తిగా చూడలేదట. కేవలం కామెడీ సన్నివేశాలు, సునీల్ శెట్టితో ఉన్న ఎపిసోడ్లు, పాటలు తప్ప మిగితా సినిమా అతను చూడలేదట . ఎందుకంటే ఆ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ తనను బాగా కలవరపరుస్తుందని, అందుకే అంత ధైర్యం చేయలేకపోయానని రవికృష్ణ చెప్పాడు.

షూట్ చేస్తున్న టైంలోనూ అనిత చనిపోయాక వచ్చే సన్నివేశాలు చేసి ఇంటికొచ్చాక గోడవైపు గంటల తరబడి చూస్తూ ఉండిపోతుందేవాడట. అది గమనించి రవికృష్ణ తల్లి చాలా భయపడెదట. అందుకే దీనికి దూరంగా ఉన్నానని చెప్పాడు. ఫైనల్ గా ఇన్నెళ్ల తరువాత ఇప్పుడు ప్రేక్షకుల మధ్య కూర్చుని పూర్తిగా సినిమా చూస్తానని చెప్పాడు. నిజానికి ఒక హీరో తాను నటించిన బ్లాక్ బస్టర్ కల్ట్ క్లాసిక్ సినిమా ని రెండు దశాబ్దాల పాటు చూడకపోవడం అనే గమనార్హం.  7జి బృందావన్ కాలనీ 2 సినిమా ని  సెల్వ రాఘవన్ దర్శకత్వంలోనే వచ్చే నెల మొదలుపెట్టబోతున్నారు. 2 వ పార్ట్ లో కూడా రవికృష్ణనే హీరోగా నటించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.