మహేష్ బాబు మరదలిగా నటించిన ఈ నటి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం అతిధి. మాస్ ఎంటర్టైనర్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. కానీ ఈ సినిమాలోని కొన్ని పాత్రలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయాయి. అలాంటి పాత్రలలో హీరోయిన్ చెల్లెలు క్యారెక్టర్ అంటే మహేష్ బాబు మరదలు పాత్ర అని చెప్పాలి. అతిధి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అమృతారావు హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమాలో మహేష్ కి లవ్ ఇంట్రెస్ట్ గా ఆమె నటించగా అమృత రావు తల్లిదండ్రులు తమను చిన్నతనంలో బాగా చూసుకున్నందుకు మహేష్ కు కృతజ్ఞతలు చెప్పడానికి వారి ఇంటికి వస్తారు.

ఇక వీరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఫన్నీగా సాగుతాయి. ఇందులో బ్రహ్మానందం కూతురిగా హీరోయిన్ కి సోదరిగా కూడా ఒక క్యూట్ గర్ల్ నటించింది. ఆమె పేరు కర్మన్ సింధు. ఒక సినిమాలో సింధు హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఈ విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక అతిధి సినిమా ఆమె నటించిన మొదటి సినిమా కావడం గమనార్హం. అయినా కూడా ఆమె కెమెరా ముందు చాలా కాన్ఫిడెంట్ గా నేచురల్ గా నటించి అందరిని అలరించింది. ఇక ఆ సినిమాలో చనిపోయి అందరిని బాధపెడుతుంది కర్మన్ సింధు.. అందుకే సినిమా ఫ్లాప్ అయిందని కొంతమంది చెబుతూ ఉంటారు.

ఇకపోతే కర్మన్ సింధు ఇప్పుడు ఏం చేస్తోంది? ఎక్కడుంది? అనే విషయాలు అభిమానులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అతిధి సినిమా తర్వాత సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపని ఈమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించరు. అయితే ఇప్పుడు ఆమె హైదరాబాద్లో సైకాలజిస్ట్ గా పని చేస్తున్నట్లు.. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం చేస్తున్నట్లు సమాచారం . ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవ్వడంతో కర్మన్ సింధుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.