అనుకున్నదే అయ్యింది.. హౌజ్ నుంచి ఆ లేడీ కంటెస్టెంట్ ఔట్!

బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఫస్ట్ వీక్ పూర్తయింది. నిన్న సండే ఎపిసోడ్‍లో హోస్ట్ నాగార్జున 14 మంది కంటెస్టెంట్‍లతో ముచ్చటిస్తూ ఎంటర్టైన్ చేశాడు. మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా వేశాడు. హౌస్‍లో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో బాగా గుర్తు పెట్టుకునే విషయంతో పాటు మర్చిపోవాలనుకుంటున్న విషయం ఏంటో చెప్పాలని కంటెస్టెంట్లను అడిగాడు. దానికి ఒక్కొక్కళ్లు ఒక్కోలా సమాధానం ఇచ్చారు.

రతిక ఆన్సర్ చేస్తూ శివాజీ తనని ఓదార్చిన తీరు నచ్చిందని కానీ సందీప్‌తో తన వాదనను మర్చిపోవాలనుకుంటున్నానని చెప్పింది. ప్రశాంత్‌ షకీలాతో తన వాదనను మర్చిపోవాలనుకున్నాడు. శుభశ్రీతో తన గొడవను మరచిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు ప్రిన్స్. షకీలాను ప్రిన్స్ బాడీ-షేమ్ చేసిన సమయాన్ని మర్చిపోవాలనుకుంటున్నట్లు కిరణ్ చెప్పింది. సమాధానాలు చెప్పాక పాము బొమ్మతో ఆడపిల్లలు వర్సెస్ మగపిల్లలు అంటూ ఓ ఫన్ గేమ్ కండక్ట్ చేశారు. దాని తర్వాత ఎలిమినేషన్ జరిగింది. అందులో అనుకున్నట్లే ఆ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది.

బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్‌లో నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లకు నాగార్జున బాక్సులను అందించాడు. తమ బాక్స్ లోపల అస్థిపంజరం ఉంటే సేఫ్ కాదని, ఫ్లవర్స్ ఉంటే సేఫ్ అని చెప్పాడు. కాగా ఈ ఆటలో శోభా శెట్టి, రతికా రోజ్ సేఫ్ అయ్యారు. దాంతో కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్ ఎలిమినేషన్ టెన్షన్‌ను ఎదుర్కొన్నారు. చివరికి కంటెస్టెంట్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది.

కిరణ్ ఎలిమినేషన్ షకీలాను భావోద్వేగానికి గురి చేసింది. ప్రిన్స్, షకీలా, శుభశ్రీ, శివాజీలు ముక్కుసూటిగా, స్వీట్ గా ఉంటారని కిరణ్ బిగ్ బాస్‌ను వదిలి వెళ్లిపోయే ముందు చెప్పుకొచ్చింది. అలానే ప్రశాంత్, శోభ, రాతిక, తేజలను ‘ఉల్టా’ కంటెస్టెంట్స్ అని పిలిచింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 7వ రోజు మొదటి ఎవిక్షన్‌తో ఫన్ & ఎమోషనల్ గా సాగింది.