ప్రమోషన్లకు డుమ్మా కొట్టిన అనుష్క శెట్టి.. షాక్‌లో మూవీ టీమ్..

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు పంచిగోళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకేక్కిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్ తో చిత్రీకరించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఆ మూవీ టీమ్ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు.

అయితే ఆ ప్రమోషన్ లో అనుష్క మాత్రం కనిపించడం లేదు. దీని బట్టి చూస్తే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రమోషన్స్ బాధ్యతలు మొత్తం నవీన్ ఒక్కడే మోస్తున్నట్లు అర్ధం అవుతుంది. నవీన్ ఇప్పటికే చాలా ప్రాంతాలకు తిరిగి ఈ సినిమా గురించి ప్రచారం చేసాడు. అలానే కొన్ని షోస్ కి గెస్ట్ గా కూడా వెళ్లి సినిమా గురించి ప్రచారం చేస్తున్నాడు. దాదాపు నెల రోజుల నుండి నవీన్ ఒక్కడే ప్రమోషన్స్ చేస్తూ, టీవీ షోస్, ఇంటర్వ్యూ లో పాల్గొనడమే కాకుండా కోస్టార్ లేకుండా స్టాండర్డ్ టూర్ చెయ్యడానికి వెళ్తున్నాడు. అసలు అనుష్క ప్రమోషన్స్ కి ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న కు మాత్రం సరైన సమాధానం ఎవరికి చెప్పడం లేదు.

అయితే అనుష్క ప్రమోషన్స్ కి రాకపోయినప్పటికి చిత్ర బృందం వారి సినిమా పై ఉన్న నమ్మకం తో శరవేగంగా ప్రొమోషన్స్ ని నిర్వహిస్తున్నారు . త్వరలోనే అమెరికా వెళ్లి అక్కడ కూడా ప్రొమోషన్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. అలానే నవీన్ అమెరికా అభిమానులతో కలిసి తన సినిమా ని చూడబోతున్నట్లు తెలుస్తుంది. ‘లైఫ్ ఇస్ బ్యూటిఫుల్’  అనే సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన నవీన్ ఆ తరువాత ‘ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ ‘ తో హీరోగా మారాడు. దాని తరువాత నవీన్ నటించిన ‘జాతిరత్నాలు ‘ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసాడు. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.