ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట గణేశ్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన ఇంట ఏ చిన్న వేడుక అయినా సరే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్తో పాటు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన సినీ తారలకు.. రాజకీయ నాయకులకు ఆహ్వానం వెళ్తుంది. అలా పిలుపు రాగానే ప్రముఖ స్టార్లంతా అంబానీ ఇంట్లో వాలిపోతుంటారు.
అయితే తాజాగా ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలో జరిగిన గణేశ్ చతుర్థి వేడుకల్లో సైతం సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. అత్యంత భక్తిశ్రద్ధలతో గణేశుడిని దర్శించుకుని.. విందులో పాల్గొన్నారు. ఇక ఈ వేడుకల్లో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆ ఒక్క వాచ్ దొరికిందంటే.. ఏం కష్టపడకుండా 2 తరాలు తింటూ బతికేయొచ్చు. ఎందుకంటే, ఆ వాచ్ అంత కాస్ట్లీ. ఆడెమర్స్ పిగ్యెట్ రాయల్ ఓక్ వాచ్ ను అనంత్ అంబానీ తన చేతికి ధరించాడు. 436 కట్ డైమండ్స్తో పాటు గోల్డ్తో ఆ వాచ్ రు తీర్చిదిద్దారు. ఇక ధర విషయానికి వస్తే.. అనంత్ అంబానీ పెట్టుకున్న ఆ వాచ్ అక్షరాల రూ. 14.15 కోట్లు. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకైపోతున్నారు. అంబానీ కొడుకంటే ఆ మాత్రం ఉండాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.