దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్ 20 23లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించింది స్టార్ నటి కీర్తి సురేష్. థిక్ బ్లూ డ్రెస్ లో కాటుక కనులతో మెరిసిపోతూ అందాల హొయలుపోయింఇ.. సహనటులతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేసింది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కు రెడ్ డ్రెస్ లో కళ్యాణి ప్రియదర్శన్ కనిపించింది.
అలాగే బ్లాక్ కాస్ట్యూమ్స్ లో శృతిహాసన్ దర్శనమిచ్చి అట్రాక్ట్ చేయగా… వీరిద్దరూ కీర్తి సురేష్ కు ఇరుపక్కల కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చారు. కాగా ఈ ముగ్గురు తన హాట్ లుక్స్ తో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలవగా.. ఒకే ఫేమ్ లో అందం బంధించబడింది అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు అభిమానులు.
ముఖ్యంగా మహానటి రేంజ్ అంటే ఇది అంటూ కీర్తిని తెగ పొగిడేస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్లో పలు స్టార్ హీరోస్ కూడా పాల్గొన్నారు. శ్రీ లీలా, ఎన్టీఆర్, రిషబ్ శెట్టి ఇలా ఎంతోమంది స్టార్ యాక్టర్స్ తమ ప్రతిభకు గాను అవార్డులను దక్కించుకున్నారు.