హ‌డావుడిగా లండ‌న్ కు చెక్కేసిన ర‌వితేజ‌.. కార‌ణం ఏంటో తెలుసా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హ‌డావుడిగా లండ‌న్ కు చెక్కేశారు. అయితే ఈ లండ‌న్ ట్రిప్ వెకేష‌న్ కోసం అనుకుంటే పొర‌పాటే అవుతుంది. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ర‌వితేజ నుంచి వ‌రుస సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. ఏడాదికి రెండు, మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్న అతి కొద్ది మంది హీరోల్లో ర‌వితేజ ఒక‌డు. ఆ ఏడాది ఆల్రెడీ ఈయ‌న నుంచి వాల్తేరు వీర‌య్య‌, రావ‌ణాసుర చిత్రాలు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతున్నాడు.

వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ లో విడుద‌ల కానుంది. అయితే ఈ మూవీ సెట్స్ మీద ఉండ‌గా.. ర‌వితేజ మ‌రో మూవీని అనౌన్స్ చేశాడు. అదే `ఈగ‌ల్‌`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫ‌స్ట్ గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డేలా చేసింది. అయితే ఈ సినిమా తాజా షెడ్యూల్ లండ‌న్ లో ప్రారంభం కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే రవితేజతో పాటు మిగతా టీమ్ అంతా లండన్‌కు ప్రయాణమయ్యింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుద‌ల కానుంది. అన్న‌ట్లు ఈ మూవీలో ర‌వితేజ పోషిస్తున్న పాత్ర‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఫ‌స్ట్ గ్లింప్స్ తోనే ఈ విష‌యం తేలింది.