ఆ స్టార్ డైరెక్టర్ తో మహేష్ సినిమా.. కష్టమేనా..?

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు డైరెక్టర్ సందీప్ వంగ.. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజ్ ని అందుకోవడం జరిగింది.. అదే చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేసి కబీర్ సింగ్.. పేరుతో రిలీజ్ చేయడం జరిగింది.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ చూస్తే ఈ సినిమా పైన ఎలాంటి హైప్ ఉందో తెలుస్తోంది.. ఆ తర్వాత హీరో ప్రభాస్ తో స్పిరిట్ సినిమాని చేయబోతున్నారు..

Mahesh Babu to team up with director Sandeep Reddy Vanga

ప్రభాస్ తర్వాత హీరో అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమాని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందుకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. అయితే ప్రభాస్ ,అల్లు అర్జున్ కన్నా ముందు మహేష్ తో డైరెక్టర్ సందీప్ వంగ సినిమా ఉంటుందని వార్తలు గతంలో వినిపించాయి ..మహేష్ కోసం ఒక సినిమాను కూడా సిద్ధం చేసినట్టు తెలియజేశారు టైటిల్ గా షుగర్ ఫ్యాక్టరీ అని కూడా పెట్టాడని అప్పట్లో వార్తలు వినిపించాయి.. కథ అయితే తెలియదు.. యానిమల్ స్పిరిట్, అల్లు అర్జున్ సినిమా ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీ అయ్యారు సందీప్ వంగ..

మరి మహేష్ ,సందీప్ వంగ ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఇప్పుడప్పుడే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు లేవు.. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళితో మూడేళ్లపాటు సినిమా చేయవలసి ఉంటుంది..ఆ తర్వాత డైరెక్టర్ లిస్టులో సందీప్ వంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ యానిమల్ సినిమా సక్సెస్ అయితే బాలీవుడ్ లో వరుస అవకాశాలు డైరెక్టర్ కు వస్తాయి.