మహేష్ బాబు నటించిన చివరి చిత్రం సర్కారీ వారి పాట ఈ సినిమాలో మహేష్ బాబు ఎంతో గ్లామర్ గా కనిపించారు. ఆ తరువాత ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాగానే లాభాలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గురించి తెలుసుకుందాం.
ఈ అమ్మడి పేరు సౌమ్య మీనన్ ఈమె సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ కూడా చేసింది. మోడలింగే కాదు మంచి డాన్సర్ కూడా ఈమె మలయాళం లో కొన్ని సాంగ్స్ కూడా చేసింది. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటించి ఆకట్టుకుంది. సౌమ్య అయితే ఈ బ్యూటీ కి మహేష్ బాబుతో కలిసి ఏదో ఒక సినిమా అయినా నటించాలని ఆశ ఉండేదట.అందుకోసమే సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో చేసింది చిన్న పాత్ర అయినా గుర్తుండి పోయేలా గుర్తింపు వచ్చింది.
ఇక మలయాళంలో అయితే హీరోయిన్ గా రెండు మూడు సినిమాలలో నటించింది. ఇప్పుడు తెలుగులో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సౌమ్య పుట్టినరోజు వేడుక జరిగింది.
అందులో తన కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేసింది. అయితే ఆ సినిమాలో లేడీ ఒరియాంటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంద. ఈ చిత్రాన్ని వి.శశిభూషణ్ డైరెక్షన్లో తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో సౌమ్య రెండు డిఫరెంట్ షేర్స్ ఉన్న పాత్రల్లో నటించబోతోందట. సౌమ్య సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గా ఉంటుంది.