గొప్ప ప‌నితో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న గౌత‌మ్‌.. మ‌హేష్ కొడుక‌నిపించుకున్నాడు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ హీరోగానే కాకుండా రియ‌ల్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు. `మ‌హేష్ బాబు ఫండేష‌న్` ద్వారా అనేక సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌కు త‌న‌వంతు సాయం చేస్తున్నాడు. ఆంధ్ర హాస్పిటల్స్, రెయిన్ బో హాస్పిటల్స్ తో చేతులు క‌లిపి కొన్ని వందల మంది పిల్లలకు ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు.

అయితే మ‌హేష్ బాబు మాత్ర‌మే కాదు ఆయ‌న త‌న‌యుడు గౌత‌మ్ ఘట్టమనేని కూడా త‌న గోల్డెన్ హార్ట్ ను బ‌య‌ట‌పెట్టాడు. గొప్ప ప‌నితో అంద‌రి మ‌న‌సులు దోచుకున్నాడు. తాజాగా గౌత‌మ్ రెయిన్ బో హాస్పిటల్స్ ను సందర్శించి ఎంబీ ఫౌండేషన్ ద్వారా చికిత్స చేయించుకున్న పిల్లలను ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. అంకాలజీ, కార్డియో వార్డులో ఉన్న పిల్లలతో కలిసి కాసేపు ముచ్చటించాడు.

ప్రేమ‌గా మాట్లాడుతూ వారి మొహంలో నవ్వును తీసుకొచ్చాడు. వారికి నాయం అవుతుందంటూ భరోసానిచ్చాడు. అంతేకాదు, వారికి స్పెష‌ల్ గిఫ్ట్ ను కూడా అంద‌చేశాడు. ఈ విష‌యాన్ని న‌మ్ర‌త స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. గౌత‌మ్ ను చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉందంటూ ఆమె మురిసిపోయింది. ఇక న‌మ్ర‌త పోస్ట్ తో నెటిజ‌న్లు గౌత‌మ్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మ‌హేష్ కొడుక‌నిపించుకున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)