తెలుగు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న సాయి పల్లవి..!!

టాలీవుడ్లో మొదటిసారి ఫిదా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ సాయి పల్లవి. తన మొదటి సినిమాతోనే అందంతో అభినయంతో ఆకట్టుకున్న ఈ మద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించింది. చివరిగా రానాతో కలిసి విరాటపర్వం సినిమాలో నటించింది.ఈ సినిమాలో ఈమె నటన అద్భుతం అని కూడా చెప్పవచ్చు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ను అందుకుంది.

Sai Pallavi Killing Her Career?

ఈ సినిమా తర్వాత సాయి పల్లవి ఇప్పటివరకు తన కొత్త సినిమాను అనౌన్స్మెంట్ చేయలేదు. ఇతర భాషలలో కూడా సాయి పల్లవి గతంతో పోలిస్తే వరుస సినిమాలకు కమిట్ అవ్వడం లేదన్నట్లుగా తెలుస్తోంది.సాయి పల్లవి ఎందుకు సినిమాలు కమిట్ అవ్వడం లేదు అని విషయం పై ఇప్పటివరకు ఎలాంటి సమాధానమైతే లేదు..దీంతో అభిమానులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు.. ఇతర భాషలలో అడపాదడపా సినిమాలలో నటిస్తున్న సాయి పల్లవి తెలుగు విషయానికి వస్తే అసలు తగ్గడం లేదు..

టాలీవుడ్ లో సినిమాలు చేయాలని ఆసక్తి తనకు లేదంటూ కూడా తెలియజేసినట్లు సమాచారం. అన్ని భాషలలోకి తెలుగు ప్రేక్షకులు మాత్రమే అత్యధికంగా సాయిపల్లవి అభిమానిస్తున్నారని విషయం తెలిసిందే తెలుగు ప్రేక్షకులకు లేడీ పవర్ స్టార్ అంటూ పిలుచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇలా చేయడంతో అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు.. మరి కొంతమంది మాత్రం తెలుగులో ఒక సినిమా అయినా చేస్తే బాగుంటుంది కదా అంటూ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు కానీ ఈ ముందుకు ముందు మాత్రం తెలుగులో సినిమాలు చేయనట్టు చెప్పేసినట్లు సమాచారం.ఈమె చెల్లెలు కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కానీ వీరిద్దరూ సినిమాలో ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.. అందుకు గల కారణం ఏంటో తెలియక అభిమానులు సతమతమవుతున్నారు.