మరోసారి అనసూయ హాట్ కామెంట్స్.. నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్

ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా అనసూయ అందం ఏ హీరోయిన్ కంటే తక్కువ కాదు. అందచందాలతోనే కాకుండా తన అభినయంతో ఆమె ఆకట్టుకుంటోంది. యాంకర్ నుంచి హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు చాలా పాత్రలు పోషిస్తోంది. బ్లాక్‌బస్టర్ సినిమాల్లో తనదైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక ఆమె
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ అభిమానులతో ఆమెకు నిత్యం వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. తరచై ఆమెను వారు ఆంటీ అని సంబోదిస్తుంటారు. దానికి ఆమె అస్సలు ఊరుకోదు. వారితో సోషల్ మీడియాలో ఫైట్ చేస్తోంది. ఓ సారి ఏకంగా సైబర్ సెల్ వారికి కంప్లయింట్ కూడా ఇచ్చింది. అయితే ఇటీవల ఆమెకు ఏమైందో తెలియదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో గొడవలు ఆపేస్తానని, విజయ్‌కు తెలిసిన వాళ్లు డబ్బులిచ్చిన తనపై నెగెటివిటీ ప్రచారం చేయిస్తున్నారని పేర్కొంది.

ఆ గొడవకు ముగింపు పలికిన కొద్ది రోజులకే ఆమె తాజాగా సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ అవుతోంది. ఇటీవల యాంకర్ రష్మికి ఓ నెటిజన్‌కి మధ్య క్యాస్ట్ విషయంలో గొడవ జరిగింది. అందులో మరో నెటిజన్ ఎంటర్ అయ్యాడు. రష్మికి ఆ మాత్రం చెప్పే ధైర్యం ఉంది కానీ మరో యాంకర్ అనసూయకు అది కూడా లేదని కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ అనసూయ కంట పడింది. దీంతో వెంటనే ఆమె ఫైర్ అయింది.

సంబంధం లేని విషయాల్లో తనను లాగడం ఏంటని మండిపడింది. ఎవరి ఇష్టాలు, అభిప్రాయాలు వారికి ఉంటాయని, అన్ని విషయాల్లో స్పందించాల్సిన అవసరం లేదు అంకుల్.. అంటూ కామెంట్ చేసింది. దీంతో అనసూయతో పెట్టుకుంటే ఇంతేనని, ఇచ్చి పడేసింది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. యాంకరింగ్‌కు దాదాపు గుడ్ బై చెప్పిన ఆమె ప్రస్తుతం సినిమాలలో బిజీగా మారింది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా పుష్ప-2లో ఆమె నటిస్తోంది. మొదటి పార్ట్‌లో ఆమె కనిపించింది కొద్ది సేపే అయినా ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది.