మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. తను నటిస్తున్న భోళా శంకర్ సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా అయిపోయిన వెంటనే పలు రకాల క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్తే బిజీగా మారిపోయారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి భోళా శంకర్ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు ఇందులో తమన్నా హీరోయిన్గా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది సినిమా తర్వాత డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లుగా సమాచారం. కళ్యాణ కృష్ణ గతంలో నాగార్జునతో కలసి సోగ్గాడే చిన్నినాయన.. బంగార్రాజు వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు చిరంజీవితో కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ విశిష్ట తో కలిసి ఒక సినిమాని చేయబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమా గురించి ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఎందుకంటే టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వశిష్ట గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబీసార అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. ఇప్పుడు చిరంజీవితో కూడా అలాంటి కథతోనే సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై చిత్ర బృందం కానీ చిరంజీవి కానీ క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.