అనసూయ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా చేసి బాగా ఫేమస్ అయింది ఈ అమ్మడు. ఈ ఒక్క షో తోనే అనసూయ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జబర్దస్త్ కంటే ముందు అనసూయ ఎవరికి పెద్దగా తెలీదు. అసలు ఈ షో కంటే ముందు అనసూయ ఏంచేసేది? అనసూయ ఎక్కడ పుట్టింది? లాంటి విషయాలు అన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అనసూయ విశాఖపట్నం లో పుట్టి హైదరాబాద్ లో పెరిగింది. హైదరాబాద్ లోనే MBA పూర్తి చేసి HR డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసింది. ఆ సమయంలోనే సాక్షి టీవీ వారు యాంకర్ కావాలి అని యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ చూసిన అనసూయ ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ అయింది. సాక్షి టీవీ లో గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రామ్ చేసింది. అయితే సాక్షి టీవీ లో చేరకముందు అనసూయ కి పెద్దగా తెలుగు వచ్చేది కాదు. సాక్షి లో చేరిన తరువాత వాళ్లే ఆమెకి తెలుగు మాట్లాడం స్పష్టంగా నేర్పించారు అని అనసూయ ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.

ఇక సాక్షి టీవీ లో పనిచేస్తున్న సమయంలోనే అనసూయకి సుశాంత్ భరధ్వాజ్ తో పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత అనసూయ MAA టీవీ లో rj గా పనిచేస్తూనే కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా పని చేసింది. ఆ టైమ్ లోనే అనసూయ కి జబర్దస్త్ కమెడి షో నుండి ఆఫర్ వచ్చింది. జబర్దస్త్ కి అనసూయ సెలెక్ట్ అయిన తరువాత ఆమె జాతకమే మారిపోయిందని చెప్పాలి. ఇక జబర్దస్త్ లో బాగా ఫేమస్ అయిన అనసూయ సినిమా లో కూడా అవకాశం దక్కించుకుంది. పుష్ప, రంగస్థలం, ఖిలాడి లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో నటించి బాగా క్రేజ్ సంపాదించుకుంది. సినిమాలో ఎక్కువగా ఆఫర్స్ రావడంతో జబర్దస్త్ కి, బుల్లితెర కి గుడ్ బాయ్ చెప్పేసింది. ప్రస్తుతం పుష్ప -2 షూటింగ్ లో బిజీ గా ఉంది.