ఈ ఏడాది మొదటిలో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు చిరంజీవి.. ఇప్పుడు తాజాగా భోళా శంకర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వేదలం రీమిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తోంది. చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. వచ్చే నెల 11వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.
అయితే విచిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓవర్సీస్ లో ప్రారంభమయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటివరకు 15 వేల డాలర్లు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా తక్కువగా జరిగినట్లు ఇండస్ట్రీలో వర్గాలు తెలియజేస్తున్నాయి.. వీరి లెక్కల ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో కలిపి కేవలం రూ .70 కోట్ల రూపాయలకే ఫ్రీ రిలీజ్ జరిగినట్లు సమాచారం.
చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్ల రూపాయలు కలెక్షన్ చేయడం జరిగింది. కెరియర్ లో ఒక్క సూపర్ హిట్టు లేని మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం వల్లే చాలా ఘోరంగా బిజినెస్ జరిగిందని అందుకు తోడుగా తమిళ సినిమా రీమిక్ అవడం వల్ల పెద్దగా బయ్యర్లు రిస్క్ చేయలేకపోతున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే మెగాస్టార్ రేంజ్ తగ్గిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అభిమానులలో. మరి భోళా శంకర్ సినిమాతో అభిమానులను మెప్పిస్తారో లేదో చూడాలి మరి..