అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. బుట్టితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టి నటిగా తానేంటో నిరూపించుకుంది. సోగ్గాడే చిన్ని నాయనా మొదలు క్షణం, రంగస్థలం, ఎఫ్ 2, థ్యాంక్యూ బ్రదర్, పుష్ప ది రైజ్ ఇలా అనేక విజయవంతమైన చిత్రాల్లో అనసూయ నటించింది.
ఇటీవల రంగమార్తాండ, విమానం చిత్రాల్లో మెరిసింది. అయితే గత రెండేళ్ల నుంచి చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేసిన అనసూయ.. ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. క్లారిటీ చెప్పాలంటే ఆమెకు ఆఫర్లు నిల్ అనే చెప్పొచ్చు. ఇక ఇందుకు కారణం అనసూయ చేసిన బ్లెండర్ మిస్టేకే అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
అనసూయకు బుల్లితెరపైనే స్టార్డమ్ వచ్చింది. యాంకర్ గా తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకుంది. ఆ ఇమేజ్ తోనే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. కానీ, కొంత కాలం నుంచి బుల్లితెరపై అనసూయ కనిపించడం లేదు. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను వదిలేసింది. టీవీ ప్రోగ్రామ్స్ కూడా ఏం చేయడం లేదు. అందుకు ఆమె పలు కారణాలు చెప్పారు. కానీ, ఇప్పుడు అదే ఆమెకు మైనస్ అయిందని అంటున్నారు. బుల్లితెర ఆడియన్స్ కి దూరమైన తర్వాత అనసూయ క్రేజ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. అందువల్లే ఇప్పుడు ఆమెకు ఆఫర్లు మునుపటంతా జోరుగా రావడం లేదని చర్చించుకుంటున్నారు. బుల్లితెరపై కనిపించడం మానేయడం వల్లే అనసూయ కెరీర్ నాశనం అవుతుందని అంటున్నారు.