అమీ జాక్సన్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇండో అమెరికన్ యాక్ట్రస్ అయిన అమీ జాక్సన్.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. కానీ, సరైన హిట్ పడకపోవడం వల్ల ఎక్కడా సక్సెస్ కాలేకపోయింది. కొన్నేళ్ల నుంచి నటనకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. పెళ్లి కాకుండానే మొదటి ప్రియుడితో సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ప్రియుడితో విడిపోయింది.
ప్రస్తుతం ఎడ్వర్డ్ జాక్ పీటర్ వెస్ట్ విక్ అనే ఇంగ్లీష్ యాక్టర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని వివిధ దేశాలను చుట్టేస్తూ పెళ్లి కాకుండానే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇండియాకు వచ్చింది. ఇక్కడి ఐకానిక్ ప్రదేశాలను సందర్శిస్తూ.. ఎప్పటికప్పుడు ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా ఈ జంట ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియాను సందర్శించారు. అయితే చుట్టూ జనం ఉన్నా సరే ఏ మాత్రం పట్టించుకోకుండా గేట్ వే ముందు అమీ జాక్సన్, ఎడ్వర్డ్ జాక్ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. ఒకరినొకరు కౌగించుకొని ఫోటోలు కూడా దిగారు. వీరు చేసిన రచ్చకు అక్కడ వారంతా షాకైపోతాయరు. అలాగే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారడంతో.. అమీ జాక్సన్ తీరుపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.
View this post on Instagram