కోట్ల రూపాయలు నష్టపోయిన సమంత….కారణం ఏమిటంటే?

తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. ఈ మధ్య ఈ స్టార్ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా ఒక విషయం తెలియజేసారు. ఒక ఏడాది పాటు సినెమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈమె ఒక ఏడాదిగా మయోసిటిస్ తో ఇబ్బంది పడుతున్నప్పటికీ వృక్తి పరమైన కమిట్మెంట్స్ వలన తన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేకపోయారు. మయోసిటిస్ ఒక ఆటో ఇమ్మ్యూనిటి డిసార్డర్. ఈ వ్యాధి ఉన్నవారు ఒంటి నొప్పులు, అలసటతో ఇబ్బంది పడతారు. అందువలన ఇప్పుడు ఒక సంవత్సరం పాటు ఎటువంటి కొత్త ప్రాజెక్టులు సైన్ చెయ్యకుండా మయోసిటిస్ చికిత్స కోసం యూ స్ ఏ వెళ్లే ఆలోచనలో ఉన్నారని ఆమె పుబ్లిసిస్ట్ మహేంద్ర తెలిపారు.

కానీ సమంత ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు కమిట్ అయ్యి ఉన్నారు. కానీ తాను ఇప్పుడు ఆ సినిమాలు చేసే పరిస్థితుల్లో లేరు కనుక తీసుకున్న పారితోషకం మొత్తం తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సమంత తనకు ఉన్న క్రేజ్, డిమాండ్ బట్టి ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు పారితోషకం అందుకుంటున్నారు. ఇప్పుడు మూడు సినిమాలకు కలిపి సుమారుగా 12 కోట్ల రూపాయలో ఆమె నష్టపోయినట్టే. ఐతే డబ్బు కన్నా ఆరోగ్యమే ముఖ్యమని భావించి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మికతలో వెతుకుంతున్నారు.

సమంత ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ లో పనిచేస్తున్నారు. సిటాడెల్ మెరియు ఖుషి. సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ వారు నిర్మించిన ఒక స్పై ఆక్షన్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో సమంత వరుణ్ ధావన్తో కలిసి నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఈ మధ్యే పూర్తయ్యింది. ఖుషి చిత్రం కూడా చివరి షెడ్యూల్ పూర్తి కాబోతోంది. ఈ చిత్రంకి శివ నిర్వాణం దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరో. ఈ చిత్రం సెప్టెంబర్లో రిలీజ్ కు సిద్ధమవుతోంది.