రాష్ట్రపతిని మీటైన సమంత.. రాజకీయాల్లోకి వస్తుందా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రస్తుతం సమంత భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ కేరిర్ ని కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘యశోద’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అలానే సమంత నటించిన శాకుంతలం సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి డిస్పాయింట్ చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో సమంత నటిస్తుంది. ఇక బాలీవుడ్ లో ‘సిటాడెల్’అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది.

సిటాడెల్ అనే వెబ్‌సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సిటాడెల్ టీమ్ భారత రాష్ట్రపతి ధ్రౌపతి ముర్ముని కలిసారు. ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ సెర్బియా లో జరుగుతుంది. అదే సమయంలో ద్రౌపది ముర్ము కూడా అక్కడే ఉన్నారు. సెర్బియా దేశ అధ్యకుడి ఆహ్వానం మేరకు భారత రాష్ట్రపతి మూడు రోజులు పర్యాటన నిమిత్తం ఆ దేశానికి వెళ్లగా సిటాడెల్ టీమ్‌తో సమంత కూడా మర్యాదపూర్వకంగా ద్రౌపది ముర్మును కలిశారు.

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని కలిసిన వారిలో ఫిలిం మేకర్స్ రాజ్ అండ్ డీకే, వరుణ్ దావన్, సమంతతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. అయితే రాజ్ అండ్ డీకే ధ్రౌపతి ముర్ముతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ ‘ గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ధ్రౌపతి ముర్ము గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఆమె ఎక్కువగా కామెడీ సినిమాలే ఇష్టపడతారట. కానీ మా కోసం మా యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూడటానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు.’ అంటూ పోస్ట్ చేసారు. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఫ్యాన్స్ సమంతను ఒకసారిగా ప్రెసిడెంట్‌తో చూడటంతో” రాజకీయాల్లోకి వస్తారా ఏంటి, మేడం” అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.