యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో వచ్చిన చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా ఈనెల 16వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగబోతోంది. ముఖ్యంగా త్రీడి విజువల్స్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. తిరుపతిలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చాలా అంగరంగ వైభవంగా పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సౌండ్ సెట్టింగ్తో పాటు పలు రకాల ప్రోగ్రాములు కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాపై బాలీవుడ్ లో రామాయణం సీరియల్ లో లక్ష్మణుడు పాత్రలో నటించిన సునీల్ లహ్రి కామెంట్ చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
ఈ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రం రాముడు పాత్రలో ప్రభాస్ నటించిన లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు.. తాజాగా ఈ సినిమా విషయంపై సునీల్ లహ్రి మాట్లాడుతూ సన్నీ సింగ్ అయితే ఒక మంచి నటుడు కచ్చితంగా ఈ చిత్రంలోని లక్ష్మణుడు పాత్రకు న్యాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను.. డైరెక్టర్ కథని ఎలా చూపించారు అనేది బట్టి నటీనటుల పర్ఫామెషన్స్ ఉంటుందని సునీల్ తెలియజేయడం జరిగింది.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది..
ఆమెకు ఇదే మొదటి పారాణిక చిత్రం కూడా రావణ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఏది ఏమైనా ఆది పురుష్ సినిమా పైన మాత్రం భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటిని అందుకోవడం లో డైరెక్టర్ ఏమాత్రం విఫలమైన ఆరంభంలో టీజర్ రిలీజ్ అయిన తర్వాతే జరిగినట్టు జరుగుతుందని తెలిపారు సునీల్ .హిందువుల మనోభావాలతో ముడిబడిన అంశం కాబట్టి.. ఆది పురుష్ ని ప్రేక్షకులు దృక్కోణం నుంచి తెరకెక్కించేలా ఉండాలి అని తెలిపారు.