టాలీవుడ్లో హీరోయిన్గా ఒక మోస్తారు సినిమాలలో నటించిన లావణ్య త్రిపాఠి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఎట్టకేలకు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ రూమర్స్ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ లావణ్య త్రిపాఠి కొణిదల వారి ఇంటి కోడలు కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని విరీ నిశ్చితార్థం కూడా ఈనెల తొమ్మిదవ తేదీన హైదరాబాదులో జరగబోతోందట.
అయితే వీరి నిశ్చితార్థానికి కొంతమంది అతిధులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం.. లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించింది.. ఈమె తండ్రి లాయర్ కావడంతో ఈమె కుటుంబం అంతా కూడా ఉత్తరఖండ కు వెళ్లిపోయారట.అక్కడే లావణ్య బాల్యమంతా గడిపేసినట్టు తెలుస్తోంది.. కేవలం పై చదువుల కోసం ముంబైకి వెళ్లి అక్కడ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా మోడలింగ్ వైపు ఆసక్తి పెరగడంతో అటువైపుగా అడుగులు వేసిన లావణ్య త్రిపాఠి పలు వాణిజ్య ప్రకటనలు టెలివిజన్ షోలలో నటించింది.
అలా 2006లో మిస్ ఉత్తరకాండగా ఎంపికయింది ఈ ముద్దుగుమ్మ. 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాలో నటించింది.. ఆ తర్వాత దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. చివరిగా హ్యాపీ బర్త్డే సినిమాలో నటించింది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం వల్లే వీరికి ప్రేమ మొదలైనట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.