టాలీవుడ్ లో కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన వారిలో వేణుమాధవ్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో వేణుమాధవ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా నటించి మంచి పాపాలిటీ సంపాదించారు. ఇప్పటికీ ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సక్సెస్ కాలేకపోతున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో కమెడియన్ల హవా భారీగానే తగ్గిపోయింది. గతంలో నటుడు వేణుమాధవ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేవారు. అయితే తన ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది వేణుమాధవ్.
ఇదంతా ఇలా ఉంటే వేణుమాధవ్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు.కేవలం నటన మీద కాకుండా దర్శకత్వం మీద కూడా మంచిపట్టు ఉండేదట.ఒకానొక దశలో ఆయన సన్నివేశాలను ఆయనే దర్శకత్వం వహించుకునే వారిని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉండేవి.. రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాలో వేణుమాధవ్ ట్రాక్ మొత్తం స్వయంగా ఆయనే డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే చత్రపతి సినిమాలో కూడా ఇదే తరహాలోనే వేణుమాధవ్ దర్శకత్వం వహించుకున్నారట.
అప్పట్లో వేణుమాధవ్ వరుస హిట్స్ లతో మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే ఒక హీరోని పెట్టి తానే నిర్మాతగా మారి ఒక సినిమాను తీయాలనుకున్నారట.. అతని ఎవరో కాదు నటుడు సునీల్ తో ఒక సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేశారట వేణుమాధవ్. సునీల్ అందాల రాముడు సినిమా తర్వాత కమెడియన్గా కొనసాగించేవారు. అలాంటి సమయంలోనే వేణుమాధవ్ సునీల్ కాంబినేషన్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం జరిగిందట. అంతేకాకుండా సునీల్ డేట్లు కూడా అడ్జస్ట్ చేసి వేణుమాధవ్ కోసం ఎన్ని రోజులైనా ఇచ్చారట. కానీ స్క్రిప్ట్ డెవలప్మెంట్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవ్వడంతో వేణుమాధవ్ కి ఫైనాన్సుగా ఎవరు సహాయం చేయకపోవడంతో చివరి నిమిషంలో ఆ సినిమాని నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో అటు సునీల్ డేట్లు కూడా వేస్ట్ అయ్యాయని సమాచారం.