తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి రచిత (మహాలక్ష్మి) సుపరిచితమే.. ఈమె తెలుగులో స్వాతి చినుకులు సీరియల్ ద్వారా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. టాలీవుడ్ లో కన్నా కోలీవుడ్లో ఎక్కువగా ఫేమస్ అయ్యింది రచిత.. మహాలక్ష్మి తెలుగు తమిళ్ కన్నడ భాషలలో 12 సీరియల్స్ లో నటించింది. తాజాగా ఈ అమ్మడు తన భర్త పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త దినేష్ కార్తీక్ ఫోన్లో తనని బెదిరిస్తున్నారని పలు రకాల అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నారని చెన్నైలో మహిళ పోలీసులకు రచిత ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఈ విషయం తెలిసిన భర్త దినేష్ ని పోలీసులు అక్కడ పిలిచి విచారించినట్టుగా సమాచారం.. తనతో ఇబ్బందికరంగా ఉంటే విడాకులు తీసుకోవచ్చని విషయాన్ని తెలియజేసినట్టు సమాచారం. నటి ఫిర్యాదు పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలియజేశారు ఆమె చేసిన ఆరోపణల పైన కేసు ఫైల్ చేసి ఇద్దరి మధ్య వివాదాలకు కారణం ఏమై ఉంటుందో అంటూ పలు రకాల కోణాలలో ఈ కేసును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహాలక్ష్మి, దినేష్ కార్తీక్ ఇద్దరు ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. మొదటిసారి వీరిద్దరూ పిరివం సంతిప్పమస్ అనే సీరియల్ ద్వారా జంటగా నటించారు.
ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు.అలా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందట. ఆ స్నేహం చివరికి ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసిందట. అయితే కొంతకాలం వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దినేష్ తన భార్యనుండి గొడవలు సర్దు మునుగుతాయని చాలా ధీమాతో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. కానీ ఇంతలోనే రచయిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోలీవుడ్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.