గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి కూతురు సుస్మిత-హీరో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం జరిగి వివాహం క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే.. అయితే అందుకు కారణం మాత్రం ఇప్పటికి సస్పెన్స్ గానే ఉన్నది.కానీ పలు రకాల రూమర్స్ అయితే ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. నిన్నటి రోజున ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ తొలినాలలో సాధించిన విజయాల గురించి చర్చలు జరుగుతూ ఉండడంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది.
నిన్నటి రోజున ప్రముఖ జర్నలిస్ట్ భరద్వాజ్ సుస్మిత, ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ బ్రేక్ కావడానికి గల కారణాలను తెలియజేయడం జరిగింది. భరద్వాజ్ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ మరణం ఎంతో మంది అభిమానులను ఇప్పటికీ బాధపెడుతోందని తెలియజేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఉదయ్ కిరణ్ ప్రాణాలు కోల్పోవడం పై భరద్వాజ్ స్పందిస్తూ.. ఒకానొక సమయంలో ఉదయ్ కిరణ్ ఫ్యూచర్ హోప్స్ ఆఫ్ ఇండస్ట్రీ అని అనిపించిందని తెలిపారు. నువ్వు నేను సినిమా తరుణ్ వదులుకోవడం వల్ల ఉదయ్కిరణ్ చేతికి వచ్చిందని తెలిపారు.
ఈ సినిమానే ఉదయ్ కిరణ్ కు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది.. చిరంజీవి కూతుర్లు ఇష్టమైన హీరో ఎవరని అడగగా ఉదయ్ కిరణ్ పేరు చెప్పారని అందులో సుస్మిత చెప్పిందని తెలిపారు.. ఇక ఇంద్ర సినిమా శతదినోత్సవ వేడుకలకు ఉదయ్ కిరణ్ హాజరు కావడానికి ముఖ్య కారణం ఉదయ్ కిరణ్ సుస్మిత పెళ్లి ఫిక్స్ కావడమే అని తెలిపారు భరద్వాజ్..మనసంతా నువ్వే చిత్రంలో కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ ఆ సినిమా ఉదయ్ కిరణ్ వల్లే సక్సెస్ అయిందని తెలిపారు. సుస్మిత తో ఎంగేజ్మెంట్ ముందు ఉదయ్ కిరణ్ కొంతమంది జర్నలిస్టులకు పార్టీ ఇచ్చారని తెలిపారు భరద్వాజ్.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలిపారు..
ఉదయ్ కిరణ్ ఒక మహిళా జర్నలిస్టుతో ప్రేమలో ఉండడం వల్లే సుస్మిత నిశ్చితార్థం ఆగిపోయిందని ప్రచారం జరిగింది. కానీ మెగా ఫ్యామిలీ ఉదయ్ కిరణ్ ను తొక్కేసిందనే వార్తలు ఎక్కువగా వినిపించాయి.. కానీ ఉదయ్ కిరణ్ మాత్రం చిరంజీవి సినిమాలో చూస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని తనతో తెలియజేసినట్లుగా తెలిపారు. ఉదయ్ కిరణ్ తన జీవితంలో సక్సెస్ లను తీసుకున్నంత ఈజీగా ఫెయిల్యూర్స్ ని తట్టుకోలేకపోయారని తెలిపారు భరద్వాజ్.