హీరోయిన్ ప్రియమణి కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. మొదట 2003లో ఎవరే అతగాడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది.ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. సినిమాలలోనే కాకుండా స్పెషల్ సాంగ్ లో కూడా నటించి అలరించింది ప్రియమణి. తెలుగు తమిళంలో కూడా వరుస ఆఫర్లు అందుకున్న ప్రియమని వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మల్లి బుల్లితెరపై షోలలో జడ్జిగా సందడి చేస్తూ ఉండేది.
నారప్ప తదితర చిత్రాలతో రీ యంట్రీ ఇచ్చిన ప్రియమణి బాగానే సక్సెస్ అందుకుంది.. ఆ తర్వాత విరాటపర్వం, భామ కలాపం, కస్టడీ తదితర చిత్రాలలో కూడా నటించి అద్భుతమైన నటనను ప్రదర్శించింది.. ప్రియమణి తన కెరీర్లో గ్లామర్ పాత్రలు వివాహానికి ముందు చాలానే నటించింది.
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించిన ప్రియమణి తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ ఉండేది. అయితే తాజాగా ఈ అంశం పైన మాట్లాడిన ప్రియమణి పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించింది..
ప్రియమణి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తాను ముద్దు సీన్లలో నటించడం ఆపేశానని దీనికి గల కారణాన్ని కూడా వివరించింది.. ప్రియమణి మాట్లాడుతూ వివాహం తర్వాత కిస్సింగ్ సన్నివేశాలలో నటించకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారని తెలియజేసింది. అది ఒక పాత్ర అయినప్పటికీ వ్యక్తిగతంగా తాను దానివల్ల చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని అలాంటి సన్నివేశాలలో నటిస్తే తన భర్తకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ప్రియమణి తన అభిప్రాయంగా తెలిపింది.. ఇక తనకు 2017లో వివాహం అయ్యిందని.. ఆ తర్వాత ముద్దు సన్నివేశాలలో అసలు నటించలేదు సినిమా ఓకే చేసే ముందే ఈ విషయాలను చెబుతాను నేను నటించే సినిమాలను మా కుటుంబ సభ్యులు అందరూ చూస్తారు అలాంటి వాటి వల్ల వారు ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదని అందుకే తన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. తన భర్త అంటే తనకు చాలా ఇష్టమని అందుకోసమే ఇలా చేస్తున్నానని తెలిపింది