జైపూర్ కోట‌లో రక్షితతో ఏడడుగులు వేసిన శ‌ర్వానంద్‌.. హ‌నీమూన్ మాత్రం అక్క‌డేన‌ట‌!?

టాలీవుడ్ హీరో శ‌ర్వానంద్ ఎట్ట‌కేల‌కు త‌న బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి ఓ ఇంటివాడు అయిపోయాడు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు ర‌క్షిత రెడ్డి మెడ‌లో నిన్న రాత్రి శ‌ర్వానంద్ మూడు ముళ్లు వేశాడు.

రాజస్థాన్‍లోని జైపూర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ లో కాక్ టెయిల్, మెహందీ, సంగీత్, హల్దీ ఈవెంట్ ల‌ తో వీరి వివాహం రెండు రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. కుటుంబస‌భ్యులు, బంధువులు, స‌న్నిహితుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు, ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు శ‌ర్వానంద్‌, ర‌క్షిత వివాహ వేడుక‌కు హాజ‌రు అయ్యారు.

నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఆల్రెడీ శ‌ర్వానంద్ పెళ్లి ఫోటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక వివాహం అనంత‌రం ఈ నూత‌న జంట హ‌నీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. స‌మ్మ‌ర్ కాబ‌ట్టి.. మాల్దీవ్స్ బెస్ట్ ఆప్ష‌న్‌గా ఎంచుకున్నార‌ట‌. ఆ వెంట‌నే ఓ ఫారెన్ ట్రిప్ కూడా వేయ‌నున్నార‌ని తెలుస్తోంది. జూన్ మూడో వారంలో ఈ కొత్త జంట హ‌నీమూన్ కోసం ఫ్లైట్ ఎక్క‌నున్నార‌ని అంటున్నారు.