`సిటాడెల్‌`కు స‌మంత రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. బాలీవుడ్ హీరోయిన్లు కూడా దిగ‌దుడుపే!?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ల‌లో `సిటాడెల్‌` ఒక‌టి. రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్నారు. హాలీవుడ్ లో రూసో బ్రదర్స్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సిటాడెల్‌`కు ఇండియ‌న్ వెర్ష‌న్ ఇది. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది.

అయితే ఈ సిరీస్ కు స‌మంత అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కు ముందు ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 5 కోట్ల రేంజ్ లో పారితోషికం పుచ్చుకునే స‌మంత‌.. సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు ఛార్జ్ చేస్తుంద‌ట‌. ఈ విష‌యం తెలిసి రెమ్యున‌రేష‌న్ విష‌యంలో స‌మంత ముందు బాలీవుడ్ హీరోయిన్లు కూడా దిగ‌దుడుపే అని మాట్లాడుతుకుంటున్నారు.

అలియా భట్, దీపికా, కంగనా వంటి బాలీవుడ్ తారలే రూ. 8 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు. కానీ, స‌మంత ఇప్పుడు వారినే మించిపోయింది. కాగా, స‌మంత ఇత‌ర ప్రాజెక్ట్స్ విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఈ బ్యూటీ `ఖుషీ` అనే రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ లో న‌టిస్తోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. ఇక మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ కూడా స‌మంత చేతిలో ఉన్నాయి.