పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎవరు గ్రీన్ హాట్ టాపిక్. గత పదేళ్ల నుంచి అభిమానులు ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడా అని ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. కానీ ఆ తరుణం మాత్రం రావడం లేదు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టినా.. అవి చివరకు పుకార్లుగానే మిగిలాయి. వయసు 40 దాటిన ప్రభాస్ పెళ్లి ఊసు ఎత్తకపోవడం పై అభిమానులు ఎంతో అసహనంతో ఉన్నారు.
ఇలాంటి తరుణంలో `ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ప్రభాస్ పెళ్లిపై ఫైనల్ గా ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మైథలాజికల్ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఇందులో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటింంచారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో నిన్న రాత్రి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు.
వేలాది మంది అభిమానులు ఈ ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. గోవింద నామస్మరణ జరిగే చోట.. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక ప్రభాస్ ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ గురించి, చిత్ర టీమ్ పడ్డ కష్టం గురించి వివరించారు. ఆదిపురుష్ సినిమా చేయడం గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. జానకి పాత్రలో నటించిన కృతి సనన్ పై ప్రశంసలు కురిపించారు. ఇక ప్రభాస్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పెళ్లెప్పుడూ అంటూ తెగ గోల చేశాడు. దాంతో ప్రభాస్ `పెళ్లా.. తిరుపతిలోనే చేసుకుంటాలే ఎప్పుడైనా..` అంటూ చెప్పుకొచ్చి నవ్వులు పూయించాడు. మరి నిజంగానే తిరుపతిలో ప్రభాస్ పెళ్లి పీటలెక్కితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.