ఎట్టకేలకు తనపై వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ స్పై సినిమా ట్రైలర్ నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. దీంతో గత కొద్దిరోజులుగా నిఖిల్ కు నిర్మాతలకు మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి అనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.. ఈ విషయాలకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా డబ్బింగ్ కూడా నిఖిల్ ఈ సినిమాకు చెప్పడం లేదని వార్తలు ఎక్కువగా వినిపించాయి. కానీ అవన్నీ నిజాలు కావని నిన్నటి రోజున నిఖిల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Spy Movie Theatrical Trailer Launched - rspnetwork.in

స్పై సినిమా విడుదల సమయం తక్కువగా ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఎక్కువగా చేయకపోవడంతో నిఖిల్ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయడం మంచిదంటూ దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంలో నిర్మాతలు మాత్రం నిఖిల్ మాటలను పక్కనపెట్టి ఈ నెల 29వ తేదీని విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ నిఖిల్ మాత్రం అందుకు ఒప్పుకోలేదని దీంతో వీరిద్దరి మధ్య పలు వివాదాలు తలెత్తాయని వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ కేవలం వట్టి రూమర్సే అంటూ తాజాగా నిఖిల్.. మాట్లాడుతూ నిర్మాతలు ఈ సినిమా చూపించి తనను సంతృప్తి పరిచేలా చేశారని తెలియజేశారు.

అలాగే డైరెక్టర్ కూడా తనను చాలా సంతృప్తి పరచాలని కానీ ఈరోజు నేను కాస్త ఆలస్యమైన ప్రెస్ మీట్ కి వచ్చి ప్రమోట్ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చానని ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో నిఖిల్ తెలియజేశారు. ప్రేక్షకులు ఒక టికెట్ పైన రూ .250 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సినిమా నాణ్యత తక్కువగా ఉందని అతను భావిస్తే మార్నింగ్ షో తర్వాత థియేటర్లు రద్దీ ఉండదని తెలియజేశారు. టికెట్టు పెట్టిన ఖర్చుకు వృధా అయిందని ప్రేక్షకులు భావించకూడదని నిఖిల్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే నిఖిల్ సినిమా నాణ్యత పరంగా ఏమాత్రం తగ్గిన తన సహించానని చెప్పకనే చెప్పారని తెలుస్తోంది. దీంతో ఎట్టకేలకు వివాదాలకు చెక్ పెట్టారు నిఖిల్.