మరో అదిరిపోయే యాడ్‌కి సైన్ చేసిన మహేష్.. తగ్గేదేలే!!

ప్రిన్స్ మహేష్ బాబు తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయం నుంచే యాడ్స్ చేస్తున్నాడు. వివిధ బ్రాండ్స్‌కు సపోర్ట్ చేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ఈ యాడ్స్ ద్వారా వచ్చిన మనీతో పిల్లలకు ఉచిత వైద్యం చేయిస్తున్నాడు. అలా ప్రజల కోసమే తన ఖాళీ సమయాన్ని వెచ్చిస్తూ మనుషుల్లో దేవుడిగా నిలుస్తున్నాడు. ఈ దూకుడు హీరో తాజాగా మరో యాడ్‌లో యాక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

తాజా సమాచారం ప్రకారం, ఈ హీరో ఒక మొబైల్ ఫోన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడానికి రెడీ అయినట్లు టాక్. ప్రస్తుతం ఈ హీరో గుంటూరు కారం మూవీ షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు. అలాగే ఖాళీ టైమ్‌లో మొబైల్ ఫోన్ యాడ్‌కి సంబంధించిన షూట్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 10లోగా ఈ యాడ్‌కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తేదీతో మహేష్ ఎండార్స్ చేయనున్న ఆ మొబైల్ బ్రాండ్ ఏంటనేది తెలిసిపోతుంది.

ఇకపోతే తండ్రి బాటలోనే కూతురు సితార కూడా నడుస్తోంది. ఈ చిన్నారి తన తల్లి నమ్రతతో కలిసి ఒక ప్రకటన చేస్తోంది. ప్రముఖ జువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వీరిరువురు సైన్ అప్ చేశారు. ఈ యాడ్ షూటింగ్ జరుగుతున్నట్లు ఇటీవల ఒక పోస్ట్ ద్వారా నమ్రత, సితార కన్ఫామ్ చేశారు. మొత్తం మీద మహేష్ బాబు ఫ్యామిలీ యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నారు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న గుంటూరు కారం 2014 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ప్రస్తుతానికి మూవీ చిత్రీకరణ జరుగుతుండగా ఇది ఒక హై ఇంటెన్స్ మూవీ అని తెలుస్తోంది.