తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్గా రెండు మూడు చిత్రాలలో నటించి సక్సెస్ కాలేకపోయినా వారిలో నటి ప్రగతి కూడా ఒకరు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.. ప్రగతి వయసు పెరుగుతున్నప్పటికీ కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఎంతోమంది నటీనటులకు అమ్మ వదిన పాత్రలలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంది. ప్రగతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి కష్టాల గురించి తెలియజేయడం జరిగింది.
అసలు విషయంలోకి వెళ్తే ప్రగతి మాట్లాడుతూ తాను మోడలింగ్ చేయాలన్నది తన కోరికట. అందుకోసం కొన్ని పిజ్జా హాట్ లో పనిచేశాను.. టెలికాం బూతులు ఎస్.టి.డి బూతులో కూడా పనిచేశాను.. అలాగె కార్టూన్ డబ్బింగ్ కోసం కూడా తాను పనిచేశానని తెలిపింది. అయితే ఇదంతా కేవలం తాను డబ్బు కోసమే చేశానని తెలియజేసింది.. అలా మోడలింగ్ వైపుగా వచ్చానని తెలియజేస్తోంది ప్రగతి.. అయితే అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో తనని అందగత్తె కాదని కేవలం లావుగా ఉన్నానని ఎంతోమంది కామెంట్లు చేశారని తెలిపింది.. అప్పుడే ప్రతి వృత్తికి ఒక అర్హత ఉంటుంది దానికోసం ప్రిపేర్ కావాల్సి ఉండాలని తన మనసులో అనుకొని అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యానని తెలిపింది.
అలా మొదటిసారి హీరోయిన్గా వచ్చిన అవకాశాలని తనను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయానని తెలిపింది.అందుకోసమే తనకు వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోలేకపోయాను.. కొన్ని చిత్రాలలో హీరోలతో నిర్మాతలతో ఏర్పడిన గొడవల వల్లే సినిమాలు మానేయాలనుకున్నాను.. అందుకోసమే కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చిందని కూడా తెలిపింది.. మనం ఒకరి చేతిలో నమ్మి మోసపోయామంటే మోసం చేసే వాళ్ళకంటే మోసపోయిన వాళ్ళదే ఎక్కువ తప్పు అంటూ తెలియజేసింది. మరొకసారి మన జీవితంలో అలాంటి తప్పులు రిపీట్ కాకుంటే బాగుంటుందని తెలిపింది ప్రగతి. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.