నాటీ ఫొటోలతో సెగలు పుట్టిస్తున్న బాలయ్య బాబు బ్యూటీ..

ప్రముఖ నటి ప్రజ్ఞా జైస్వాల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత గుంటూరోడు, జయ జానకి నాయక, అఖండ, మిర్చి లాంటి కుర్రోడు, ఆచారి అమెరికా యాత్ర లాంటి ఎన్నో సినిమాలో నటించింది. ఈ అమ్మడు తన అందం నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో చెలరేగిపోతుంది. ఈ టైం లోనే ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తుంది.

అవకాశాలు లేకపోయినా ఏ మాత్రం తగ్గకుండా విహారయాత్రలు చేస్తూ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఫారెన్ టూర్లు వెళుతూ కొత్త అందాలను ఆస్వాదిస్తుంది. ప్రజ్ఞ తను ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. నేచర్ అందాలకు తన గ్లామరస్ అందాలను జోడించి ఫ్యాన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తుంది. తాజాగా ప్రజ్ఞా జైస్వాల్ తన గ్లామరస్ అందాలు ఫుల్ గా చూపించేసింది. తన నాజూకు నడుము అందాలను చూపిస్తూ, క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫోటోలు చూసి కుర్రాలకు గుండెల్లో వేడి పుడుతుందట.

అఖండ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు మాత్రం పెద్దగా రావడం లేదు. అవకాశాలు రాకపోయినా అఖండ సినిమాతో అభిమానుల్లో బాలయ్య బాబు హీరోయిన్ గా ముద్ర పడింది. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో తన జోరుని పెంచేసింది ప్రజ్ఞ. సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తే అవకాశాలు వస్తాయేమో అని ఆశపడుతుంది. అలా అని ఏ పాత్రకు పడితే ఆ పాత్రకు ఓకే చెప్పకుండా, తన గ్లామర్ కి తగ్గ పాత్ర వస్తేనే నటిస్తానని చెప్తుంది. అవకాశాలు వచ్చేలోగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శక నిర్మాతల కంట్లో పడేలా ప్లాన్ చేసింది. చివరికి ప్రజ్ఞా జైస్వాల్ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.