దర్శకుడిగా అవతారమెత్తిన మరో జబర్దస్త్ కమెడియన్.. బలగం కంటే పెద్ద హిట్టే!!

బుల్లితెరపై జబర్దస్త్ అనే కామెడీ షోకి ఉన్నంత క్రేజ్ మరో షో కి లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని అందిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్న కమెడియన్లు చాలామంది ఉన్నారు. అలా జబర్దస్త్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలో సుధీర్ హీరోగా, వేణు దర్శకుడిగా మంచి స్థానం సంపాదించుకున్నారు. అంతేకాకుండా శ్రీను, రామ్ ప్రసాద్, హైపర్ ఆది, శకలక శంకర్, కిరాక్ ఆర్పి లాంటి చాలామంది కమెడియన్లు సినిమా రంగంలో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు.

వీరి దారిలోనే మరో జబర్దస్త్ కమెడియన్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దర్శకుడిగా తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నాడు. అతను మరెవరో కాదు కమెడియన్ శాంతి కుమార్. ‘నాతో నేను’ అనే సినిమాకి శాంతి కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, రాజీవ్ కనకాల, దీపాలి రాజ్ పుత్, ఐశ్వర్య కీలక పాత్రల్లో పోషించిబోతున్నారు. అలానే ఈ సినిమాని ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తుండగా, సత్య కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ‘నాతో నేను’ అనే సినిమా నుంచి ‘ఓసినీ వయ్యారి రామచిలుక’ అనే లిరికల్ వీడియోను హీరో ఆది సాయికుమార్ గురువారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ ‘ఈ మధ్య నాన్న కథలు ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు. నాతో నేను సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర చాలా కొత్తగా, బాగుంటుందని నాన్న చెప్పారు. ఇలాంటి మంచి కథను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఓసి నీ వయ్యారి రామచిలుక పాట నాకు బాగా నచ్చింది. నాతో నేను సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ‘అంటూ ఆది తెలిపారు.

ఇక కమెడియన్ నుంచి దర్శకుడుగా మారిన శాంతి కుమార్ మాట్లాడుతూ ‘నన్ను కమెడియన్‌గా ఎంతగానో ఆదరించారు. అలానే దర్శకుడిగా కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సాయి కుమార్ పాత్ర అందరికీ కంటతడి పెట్టిస్తుంది.’ అని చెప్పాడు. మరి దర్శకుడిగా శాంతి కుమార్ తన సత్తా చాటుకుంటాడో లేదో చూడాలి.