యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే రష్మీ అంటే తెలియని వారు దాదాపుగా వుండరు. తనదైన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారానే ఈమె ప్రేక్షకులకు సుపరిచితం. అయితే ఈమె ప్రస్థానం అనే సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత అవకాశాలు మందగించడంతో బుల్లితెరపైన ట్రై చేసింది. ఈ క్రమంలో అందరి మన్ననలు పొందింది. గుంటూరు టాకీస్, అంతకు మించి, బొమ్మ బ్లాక్ బస్టర్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది ఈ అమ్మడు.
ఎప్పుడూ టివి షోస్, ఈవెంట్స్ అంటూ బిజీగా గడుపుతున్న ఈ భామ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదటి నుండి రష్మీ కెరీర్ కొంచెం ఒడిదుడుకుల మయమే. రష్మీ చేతిలో ఇపుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదని భోగట్టా. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్.’ ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం ఆడలేదు.
అయితే బుల్లితెర యాంకరింగ్ లో మాత్రం రష్మీ జోరు బాగా కనిపిస్తోంది. మల్లెమాల సంస్థ మెయిన్ యాంకర్ గా రష్మీ తన హవాని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. యాంకర్ గా మాత్రం ఆమెకు తిరుగులేదని చెప్పాలి. నిజానికి అనసూయ కంటే ముందే రష్మీకి హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. అయితే సినిమా సెలక్షన్ తెలియక రష్మీ ప్లాప్స్ చవిచూశారు. ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే.