తనకు తన భర్త పర్ఫెక్ట్ కాదంటూ అనసూయ సెన్సేషనల్ వ్యాఖ్యలు..

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ యాంకర్‌గా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప, కిలాడీ, ఆర్ఆర్ఆర్ లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించి వెండితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఇలా కెరీర్ మేనేజ్ చేస్తూనే, ఇంకోవైపు ఫ్యామిలీని బాగా బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది.

అయితే అనసూయ పెళ్లి రోజు సందర్భంగా వేకెషన్‌కి వెళ్లారు. అక్కడ తన భర్త సుశాంక్‌పై ఎంతో ప్రేమని చూపించింది. మ్యారేజ్ యానివర్సరీ సందర్బంగా వేకెషన్ కి వెళ్లిన ఈ అనసూయ, సుశాంక్ బాగా ఎంజాయ్ చేసారు. సాగర తీరంలో ఎంజాయ్ చేస్తున్న అనసూయ బికినీ వేసుకొని తన భర్తను లిప్ కిస్సులతో ముంచేసింది. వాటికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ భర్తపై ఆమెకి ఉన్న ప్రేమను రాసుకొచ్చింది. ఆ పోస్ట్ చూస్తే అనసూయకు తన భర్త పై ఎంత ప్రేమ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.

‘2001 లో నవ్వు నాకు లవ్ లెటర్ రాసావు. అ సమయంలో నేను దానికి రిప్లై ఇవ్వలేకపోయ్యను. దానికి సమాధానంగా నా ప్రేమనంత ఇప్పుడు నేను నీపై చూపిస్తున్నాను. ఇన్నేళ్ల మన ప్రయాణంలో నువ్వు ఎన్నో అవమానాలు భరించావు. ఎంతోమంది నిన్ను ఎన్నో మాటలు అన్నారు. అయినా కూడా నువ్వు అవేమీ పట్టించుకోకుండా నాపై ఎంతో ప్రేమను చూపిస్తున్నావు. నాకోసం ఎన్నో త్యాగాలు కూడా చేసావు. ఒక్కోసారి నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటావు. మన పర్ఫెక్ట్ కపుల్ కాకపోయినా కష్టనష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటున్నాము. నన్ను నిండుగా స్వాగతిస్తునందుకు ధన్యవాదాలు ‘ అంటూ రాసుకొచ్చిది. ఇలా అనసూయ తన భర్త పై కురిపిస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.