ఆది పురుష్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కస్తూరి..!!

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ భారీ బడ్జెట్ తో తెరకెకెక్కించిన అది పురుష్ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం రామాయణం కథ అంశంతో తెరకెక్కించారు.ఇందులో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ లోని పాత్రలు అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం వీటి పైన నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

Kasthuri shares the photo of her son for the first time - Tamil News -  IndiaGlitz.com
గ్రాఫిక్స్ సంబంధించిన కొన్ని షాట్స్ విషయంలో నెగిటివ్ కామెంట్లు చేయడమే అభిమానులను బాధ పెట్టించేలా చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా నటి కస్తూరి శంకర్ ఆది పురుష్ పోస్టర్ల గురించి నెగిటివ్ కామెంట్స్ చేయక ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి.. రామలక్ష్మణులను మీసాలు గడ్డాలతో చూపించే సాంప్రదాయం ఎక్కడైనా ఉందా అంటూ కస్తూరి శంకర్ ప్రశ్నిస్తోంది.. ఈ విధంగా కలవరపెట్టే మార్పులను ఎందుకు చూపించారని ఆమె ప్రశ్నించడం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది లెజెండ్రీ నటులు రాముని పాత్రను పూర్తిస్థాయిలో పరిపూర్ణంగా తెరకెక్కించారు అంటూ తెలుపుతోంది.

ఆది పురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిలా కాకుండా ఒక కర్ణుడిలా కనిపిస్తున్నారంటు కామెంట్లు చేస్తోంది.అయితే ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కస్తూరి శంకర్ ప్రస్తుతం పలు సీరియల్స్ తో బిజీగా ఉన్నది. అయితే అభిమానులు మాత్రం రాముని పాత్రలో ప్రభాస్కు మీసాలు గడ్డాలతో చూడటానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని అభిమానులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి పనులను కూడా చేసుకుంది ఆదిపురుష్.