తెలుగు సినీ ఇండస్ట్రీలో 1990లో అప్పట్లో సౌత్ లో అగ్ర హీరోయిన్లు గా ఒక వెలుగు వెలిగిన ఇద్దరు హీరోయిన్లు మధ్య ఒక బిగ్ బార్ నడుస్తూ ఉండేదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. డైరెక్టర్ కళాతపస్వి కే విశ్వనాథ్ గారు తెరకెక్కించిన చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. వారెవరో కాదు ఒకరు శ్రీదేవి మరొకరు జయప్రద.. వీరిద్దరికి ఇండస్ట్రీలో వైర్యం ఉందని వార్తలు ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. ఇలా శ్రీదేవి, జయప్రద ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ఒకరితో ఒకరికి పోటీపడుతూ శత్రుత్వాన్ని కొనసాగించారని ఆమె సహచరులు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు.
డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు తెరకెక్కించిన ఒక చిత్రాన్ని హిందీలో రీమిక్స్ లో జయప్రదకు అవకాశం దగకుండా శ్రీదేవి చేసిందని సమాచారం.. అప్పటికే బోనీ కపూర్ తో ప్రేమలో ఉన్న శ్రీదేవి.. తన మరిది అనిల్ కపూర్ సరసన జయప్రద కు అవకాశం రాకుండా చేసిందట. ఈ సినిమా టైటిల్ ఈశ్వర్.. ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయినా స్వాతి ముత్యం సినిమాకు రీమిక్ గా తెరకెక్కించారు..
ఒరిజినల్గా ఈ చిత్రంలో కమలహాసన్ ,రాధిక నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.. హిందీ రీమేక్ కోసం అప్పట్లో ఉత్తరాదిన పాపులారిటీ సంపాదించుకున్న జయప్రదను ఎంపిక చేయాలని కె విశ్వనాథ్ గారు సూచించారట.కానీ అనిల్ కపూర్ ని బోనీకపూర్ హెచ్చరించి జయప్రదకు అవకాశం రాకుండా చేశారని శ్రీదేవి కూడా అప్పట్లో ఈ కుట్రలో పాల్పడిందని గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి.. ఇక శ్రీదేవి కూడా అనిల్ కపూర్ వదిన కావడం చేత తన సలహాను కూడా పాటించి జయప్రదం ఈ సినిమా నుంచి దూరం పెట్టడం జరిగిందట. దీంతో ఈ సినిమాలు విజయశాంతి నటించింది ఈ సినిమా కూడా హిందీలో బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది.