PS-2:3రోజుల్లోనే 150 కోట్ల క్లబ్లో చేరిక.. సౌత్ ఇండియన్ పవరా.. మజాకా!

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ సినిమా గత ఏడాది విడుదలై రూ.450 కోట్ల క్లబ్లో చేరి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోయినా.. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ , త్రిష, ప్రకాష్ రాజ్ , విక్రమ్ చియాన్ , జయం రవి, కార్తీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇందులో నటించిన ప్రతి నటీనటులకి కూడా మంచి గుర్తింపు లభించింది.

Maniratnam Magic'; Ponniyan Selvan 2 entered the 200 crore club in four days

ఇకపోతే మొదటి భాగం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రెండో భాగం కోసం కూడా ఎదురు చూశారు.. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 28న PS -2 చిత్రాన్ని కూడా విడుదల చేశారు . అయితే ఈసారి తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఊహించని విధంగా ఆకట్టుకుందనే చెప్పాలి . మొదటి షో తోనే శభాష్ అనిపించుకున్నారు మణిరత్నం. మొన్నటి వరకు మణిరత్నం సినిమాల్లో మ్యూజిక్ తగ్గింది అనే కామెంట్ వినిపించేది . కానీ ఆ కామెంట్ ను ఇప్పుడు ఒక్కవేటుతో పక్కకు పోయేలా పిఎస్ -2 తో చేసేసారు లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం.

ప్రస్తుతం సౌత్ ఇండియా పవర్ ఏంటో అందరికీ తెలిసేలా PS -2 సినిమా ఊహించని విధంగా కలెక్షన్లను రాబడుతోంది .ఇక తమిళ్ సాహిత్యంలోనే గొప్ప నవలలలో ఒకటిగా భావించే పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలుగా మార్చి చిత్రీకరించిన మణిరత్నం.. మొదటి పార్ట్ కు కొనసాగింపుగా రెండవ పార్ట్ ను కూడా రిలీజ్ చేశారు. త్రూ అవుట్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతోంది. అంతేకాదు కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూలు చేయడం గమనార్హం.