ప్రస్తుతం బాలీవుడ్ నటులంతా ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ వైపే మక్కువ చూపుతున్నారు.. దక్షిణాదిలో సినిమాలు చేసేందుకు నార్త్ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు..RRR తో ఆలియా భట్, సీతారామం చిత్రంతో మృణాల్ ఠాకూర్ ప్రాజెక్ట్ -K తో దీపికా పదుకొనే మొదటిసారిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. అలాగే ఎన్టీఆర్ 30 వ ప్రాజెక్టుతో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. కేవలం కథానాయకులు మాత్రమే కాకుండా స్టార్ హీరోలు సైతం తెలుగులో నటించేందుకు సై అంటున్నారు..
కొంతమంది కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటే మరి కొంతమంది గెస్ట్ రోల్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఆది పురుష్ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తూ ఉండగా ఇప్పటికీ ఈ సినిమా విడుదలకు సంబంధించి పోస్టర్స్, టీజర్ తో బాగానే ఆకట్టుకున్నాయి.. ఎన్టీఆర్ 30వ సినిమాలో కూడా ఈయన విలన్ గా నటించబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. మాస్ యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ఈయన పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండబోతోంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఈ పాత్ర పైన స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.. జాన్వీ తో పాటు తారకు సైతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు అయితే ఈ సినిమాలో విలన్ గా నటుడు ప్రకాష్ రాజు నటిస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ మార్చి 23వ తేదీన ఒక ట్విట్ చేయడం జరిగింది.. దీంతో ఈ సినిమాలు ఆయన విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
https://twitter.com/UrsVamsiShekar/status/1638750219595825152?s=20