టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సపరేటు స్థానాన్ని ఏర్పరచుకున్నారు.. తన తండ్రి బాటలోనే నాగార్జున కూడా పయనిస్తూ పలు సినిమాలలో నటిస్తూ టాలీవుడ్లో స్టార్ హీరో గా వెలుగుతున్నారు.. అంతేకాకుండా నాగార్జున కుమారులు నాగచైతన్య ,అఖిల్ వంటి వారు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంటున్నారు. ఇక నాగచైతన్య నాగార్జునకు మొదటి భార్య ఆయన లక్ష్మికి జన్మించారు. నాగార్జున, లక్ష్మి విడిపోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
నాగార్జున దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు సోదరుల సోదరిని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి పెద్దలు కుదిరించిన వివాహం కావడంతో నాగార్జున ఎందుకో లక్ష్మీ మీద పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో పాటు ఇద్దరి మధ్య దూరం కూడా పెరిగిపోయింది. అయితే అంతలోపే నాగచైతన్య జన్మించారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు దగ్గుబాటి లక్ష్మీ నాగార్జున మధ్య దూరం పెరిగి ఆమె అమెరికాకు షిఫ్ట్ అయిపోయింది. నాగార్జున కూడా సినిమాలపరంగా బిజీగా ఉండడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగినట్లు సమాచారం.
నాగార్జున తనకు ఎక్కువ సమయం కేటాయించకపోవడంతో వారిద్దరి మధ్య దూరం పెరిగిందట. అల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున అమలాపురం ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున అమలాకు అఖిల్ జన్మించారు. నాగార్జున లక్ష్మీ వివాహం 1984లో జరగగా 1986లో చైతన్య జన్మించారు.. 1990లో నాగార్జున లక్ష్మి విడిపోయారు ఆ తర్వాత తన సినిమాల హీరోయిన్గా నటిస్తున్న అమల ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు నాగార్జున.