హీరోయిన్ అనుపమ ఇంతగా మారడానికి కారణం..!!

మలయాళం ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలోకి వరుసగా ఎంట్రీ ఇస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో తనధైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ రౌడీ బాయ్స్ అనే సినిమాతో ఒక్కసారిగా తనలోని అసలైన నటిని బయటికి తీయడం జరిగింది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత 18 పేజెస్ చిత్రంతో మరొక సక్సెస్ను అందుకుంది.

Anupama Parameswaran - IMDb
అనుపమ సక్సెస్ ల గురించి చెప్పాల్సిన పనిలేదు కార్తికేయ సినిమా తర్వాత ఈమె కెరియర్ వేగవంతంగా పుంజుకుంటోంది. గతంలో ఈమె చేసిన సినిమాలు అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు..తన అందం అభినయంతో టాలెంట్ ఉన్న ఇమే ఆ తర్వాత రౌడీ బాయ్స్ సినిమాలో అసలైన అందాలతో ఘటైన ముద్దులతో రెచ్చిపోయింది. ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

Anupama Parameswaran on why she signs less Malayalam films: 'Telugu cinema has been too kind to me'-Entertainment News , Firstpost
ఒకవైపు ఓటిటి కంటెంట్ పైన దృష్టి పెట్టి మరొకవైపు ఈ అమ్మడు కెరియర్ పైన దృష్టి పెట్టి ఇలా రెండు వైపులా బాగానే ఆకట్టుకుంటోంది. అయితే ఈమె కెరీర్ కు గల టర్నింగ్ పాయింట్ ఏమిటి అనే విషయం అనుపమా అని అడగగా.. అందుకు అనుపమ మాట్లాడుతూ 2021 ముందు వరకు నేను చాలా గందరగోళానికి గురయ్యేదాన్ని ఆ సమయంలో నేను చేసిన ఫ్రీడమ్ మిడ్ నైట్ అనే లఘు చిత్రాలు తనలోని అనేక భయాలను అపోహలను తొలగించాయని తెలిపింది. తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందని ఇలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో ..పరిశ్రమ ఏమనుకుంటారో అనే భయం ఉండేది. ఆ భయంతో నాకు నచ్చిన పాత్రలు కూడా వదిలేసుకునే దాన్ని ఆ తర్వాత ఎందుకు అలా వదులుకున్నానని బాధపడేదాన్ని ఇవన్నీ పోయి ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నాను అంటూ తెలుపుతోంది. ప్రేక్షకులకు కూడా తాను ఎంచుకున్న పాత్ర వెనుక ఒక మంచి కారణం ఉంటుందని అర్థం చేసుకుంటున్నారని తెలుపుతోంది.