తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు పాటలు పాడి అందరికీ చేరువయ్యింది సింగర్ సునీత. ఈమె తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సునీత గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. తన మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత ఈ మధ్యనే రామ్ విరుపనేని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది . తాజాగా ఈయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.
అందుతున్న సమాచారం ప్రకారం గత కొన్ని రోజులుగా కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి పదేపదే కాల్స్ చేస్తూ రామ్ వీరపనేని బెదిరిస్తున్నాడని ఒకవేళ తనని బ్లాక్ లిస్టులో పెడితే వేరే వేరే నెంబర్లతో మెసేజ్లు ,బెదిరింపు కాల్స్ చేస్తున్నారని వీరపనేని రామ్ ఆ పిటిషన్ లో తెలియజేస్తున్నట్లు సమాచారం.
అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే… లక్ష్మణ్ అనే వ్యక్తి సినీ నిర్మాతల కౌన్సిల్ సభ్యుడని… అంటూ వ్యక్తిగతంగా కలవాలి అంటూ కొన్ని రోజుల క్రితం రామ్ కి కాల్ చేశాడట పదేపదే విసిగిస్తూ ఉండటంతో రామ్ అతడి నెంబర్ను బ్లాక్ లో వేయడం జరిగిందట.. అయినా కూడా లక్ష్మణ్ విడిచిపెట్టకుండా ఇతర నెంబర్లతో ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నాడట
మొదట ఏదైనా బిజినెస్ విషయమై కలవాలని అనుకుంటున్నాడేమో అని తన టీమ్ తో మాట్లాడాలని చెప్పాడట. కానీ అతడు మాత్రం వ్యక్తిగతంగా తనతోనే మాట్లాడాలని పట్టుబడుతున్నాడు అంటూ రామ్ పేర్కొన్నాడు. ఇవన్నీ చూసిన విరుపనేని రామ్ తన కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారట. అలా రామ్ చెప్పిన మాటలను బట్టి పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు.కాల్స్ కు రామ్ రెస్పాండ్ కాకపోవడంతో అతను బెదిరిస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయం ఎప్పుడు సర్దు మునుగుతుందో చూడాలి మరి.