బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ధోని బయోపిక్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా ఈయన సోదరి ప్రియాంక సింగ్ పలు సంచలన ఆరోపణలు చేసింది..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ అయినా రియా చక్రవర్తి కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తూనీగా తూనీగ వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించింది.ఆ సమయంలోనే సుశాంత్ తో ఈమె ప్రేమాయణం నడిపినట్లుగా వార్తలు వినిపించాయి.
తాజగా సుశాంత్ సోదరి ప్రియా సింగ్ .. రియాను ఉద్దేశిస్తూ ట్విట్టర్లో చేసిన ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.. తాజాగా రియా చక్రవర్తి తన సినిమాలలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది.. ఈ విషయంపై ప్రియాంక సింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ ను చేసింది.. ప్రియాంక సింగ్ తన ట్విట్టర్ లో ఈ విధంగా రాసుకొస్తూ. మీరు ఎందుకు భయపడతారు మీరు చేసే వృత్తి వేశ్య.. ఎప్పటికీ అలాగే కొనసాగుతారు మీకు మద్దతు ఇస్తున్న పాలకులను చూసి మీకు ఇంత ధైర్యం అని రాసుకొచ్చింది.
అంతేకాకుండా రియా చక్రవర్తి రోడిస్ -19 షోలో నటిస్తున్నట్లు తాజాగా తెలియజేసింది.. పోయిన వారు ఎలాగో తిరిగిరారు.. కానీ ఇప్పుడు ఎందుకు భయపడాలి అలా భయపడేవారు వేరే విధంగా ఉంటారు అని రియాచక్రవర్తి తెలియజేసింది..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవడంలో తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి హస్తము ఉందని వార్తలు కూడా వినిపించాయి. దీంతో పలు ఆరోపణలు కూడా ఎదుర్కొంది. అదే విషయంపై రియా చక్రవర్తి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. 2020 లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న బాంద్రాలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ ఈ నటుడు మరణానికి గల కారణం ఏంటని విషయం తెలియడం లేదు.
https://twitter.com/withoutthemind/status/1645364454090215431?s=20