టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి అందాల తారగా పేర్కొంది.ఇమే అందచందాలతో నటనతో కట్టు బొట్టుతో అందరినీ ఆకట్టుకుంది. శ్రీదేవి కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా కన్నడ , కోలీవుడ్,బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి విజయాలను అందుకుంది. బాలీవుడ్ లో దశాబ్దాల పాటు పనిచేసిన శ్రీదేవి భారత దేశపు తొలి మహిళ సూపర్ స్టార్ గా పేరు సంపాదించింది. శ్రీదేవి ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించింది. కానీ కేవలం ఒక్క హీరోతో మాత్రమే ససి మిర నటించడానికి ఒప్పుకోలేదట. ఆ హీరో ఎవరు వారి గురించి తెలుసుకుందాం.
బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న కథల ప్రకారం ఒక భయంకరమైన సంఘటన తర్వాత సంజయ్ దత్తుతో కలిసి శ్రీదేవి సినిమాలు చేయడానికి నిరాకరించిందట. మహేష్ భట్ 1993 చిత్రం గుమ్రా లో శ్రీదేవి సంజయ్ దత్ నటించారు. అయితే ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది కానీ షూటింగ్ సెట్లో మాత్రం ఇద్దరూ మాట్లాడుకునేవారు కాదట. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్ జరుగుతున్నప్పుడు శ్రీదేవి, సంజయ్ దత్ దూరం పెడుతూ ఉండేదట.
సినిమాలో కూడా ఈమె పాత్ర ప్రాధాన్యత లేకపోవడంతో సంజయ్ దత్, మహేష్ భట్ పైన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. హిస్మత్వాల సినిమాలో నటిస్తున్నప్పుడు శ్రీదేవి కోసం సంజయ్ దత్ సెట్స్ కు వెళ్లే వాడట.ఆ సమయంలో సంజయ్ దత్ తీవ్రంగా డ్రగ్స్ కు బానిస అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.. శ్రీదేవి మాత్రం అప్పుడప్పుడే కెరియర్ ప్రారంభాన్ని మొదలుపెట్టింది .. ఆ సమయంలో శ్రీదేవి కనిపించిన చోటుకల్ల సంజయ్ దత్ వెళ్లేవాడని సమాచారం.అలా మేకప్ గదికి కూడా వెళుతూ ఉండడంతో ఆయన ప్రవర్తన శ్రీదేవికి నచ్చాక..ఆ నటుడి ముఖం మీద తలుపులు వేసుకునేదని సమాచారం. కాలం గడిచే కొద్దీ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని తెలుస్తోంది. అయితే జమీన్ అనే చిత్రానికి సంతకం చేసిన శ్రీదేవి..కానీ అందులో వీరిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు కూడా ఉండకూడదు అని స్పష్టం చేసిందట.