Sr.ఎన్టీఆర్ 100వ జయంతి స్పెషల్ గెస్ట్ గా స్టార్ హీరో..?

సీనియర్ నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించాలని ఎన్టీఆర్ కుమారుడు సినీ నటుడు బాలకృష్ణ భావిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు బాలకృష్ణ స్వయంగా ఈ వేడుకలను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. విజయవాడ శివారు పోరంకిలో అనుమోల్ గార్డెన్ లో ఈ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా తమిళంలో సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ ని ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానాన్ని మన్నించి ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వ బోతున్నట్లు సమాచారం.

Confident that Telugu audience will like Kaala, says Rajinikanth, remembers  NTR
ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన విజయవాడకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్సవాలు ఈనెల 28వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించబోతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి టి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు ముఖ్యఅతిథిగా రజనీకాంత్ తో పాటు కొంతమంది టీడీపీ నేతలు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, బాలయ్య ఇలా అందరూ కూడా ఈ వేదికపై కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ ప్రసంగాలపై ప్రచురించిన రెండు పుస్తకాలను కూడా ఈ సభలో ఆవిష్కరించే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడి వరకు బాగానే ఉన్న రజినీకాంత్ ని ముఖ్యఅతిథిగా పిలవడం వెనుక కారణాలు ఏంటో అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఒక విధంగా ఎన్టీఆర్ అంటే రజనీకాంత్ కు కూడా మంచి అభిమానం ఉన్నప్పటికీ.. రజనీకాంత్ ని పిలవడంపై ఇది ఎన్నికల స్టంట్ అన్నట్లుగా పలువురు నేతలు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఈ వేడుకలకు తమ రాజకీయంగా ఉపయోగించాలని విధంగా చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి ఈ వేడుకలకు రజనీకాంత్ వస్తారా రారా అన్న విషయం తెలియాల్సి ఉంది.