మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోంది. `భీమ్లా నాయక్`తో గ్రాండ్ గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ వెంటనే బింబిసార, సార్ చిత్రాలతో మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది. తాజాగా సంయుక్త మీనన్ `విరూపాక్ష` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సాయి ధరమ్ తేజ్ ఇందులో హీరోగా నటిస్తే.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక వరుస విజయాల నేపథ్యంలోనే సంయుక్త మీనన్ ను గోల్డెన్ లెగ్ అంటూ పిలవడం ప్రారంభించారు. మీడియా వారు కూడా అలానే పిలుస్తుండటంతో సంయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అలా పిలవడం ఆపాలంటూ తాజాగా వార్నింగ్ ఇచ్చింది.
తాజా ఇంటర్వ్యూలో `ఈ గోల్డెన్ లెగ్ కాన్సెప్టే అసలు మంచిది కాదు. ఓ హీరోయిన్ గోల్డెన్ లేదా ఐరన్ లెగ్ అనడంలో అర్థం లేదు. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. ఇలా అనడం వల్ల మమ్మల్ని తక్కువ చేసినట్లువుతుంది. లక్ వల్లే సక్సెస్ వస్తుందని నమ్మడం సరికాదు. సరైన స్క్రిప్టులను ఎంచుకుని మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తేనే విజయం వరిస్తుంది. గోల్డెన్ లేదా ఐరన్ లెగ్ అంటూ పాటించే ఈ పాతకాలపు కాన్సెప్టును ఇకనైనా పక్కనబెట్టండి.` అంటూ సంయుక్త ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో నెటిజన్లు సంయుక్త కరెక్ట్గా చెప్పిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.