శాకుంతలం.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతున్న పాన్ ఇండియా చిత్రం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సమంత ప్రధాన పాత్రను పోషించగా.. ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు.
గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ, దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. శాకుంతలం సెట్స్ లో తనకు ఎదురైన షాకింగ్ అనుభవాలను పంచుకుంది.
శాకుంతలం సెట్ లో ఓ కుందేలు సమంతను పాపం కరించేసిందట. అలాగే శాకుంతలం కోసం సమంత ఏకంగా ముప్పై కేజీల బరువున్న లెహెంగా వేసుకుందట. అంత బరువున్న లెహెంగాలో నటించడం సామ్ కు చాలా కష్టమైందట. ఒక్కోసారి డ్రెస్ బరువు భరించలేక ఫ్రేమ్ నుంచి తప్పుకుని.. కెమెరా మ్యాన్ తో తిట్లు కూడా తిన్నదట. ఇక సమంతకు పూల ఎలర్జీ ఉంది. అయితే శాకుంతలం షూటింగ్ లో సమంత ధరించిన పూల వల్ల ఆమె చేతికి మొత్తం ర్యాషెస్ వచ్చాయట. అవి తగ్గడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టిందని సమంత తాజాగా వెల్లడించింది.